సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆయన అల్లుడు ఆగడాలు పెరిగిపోయాయని వివరించారు. మంత్రి కాకాణి ఆధ్వర్యంలో దోపిడీ జరుగుతుందని ఆడియోలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బయట పెట్టారు. నియోజకవర్గంలో 7 వేల ఎకరాల భూమి అందజేశామని చెబుతున్నారు.. ఆ వివరాలు మండల కార్యాలయాల్లో డిస్ ప్లే చేయాలని కోరారు. శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నామని చెబుతూ.. దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.