ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానూరులో ఘనంగా జరిగిన యేసు పునరుత్థాన మహోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 31, 2024, 08:29 PM

కానూరు కార్మెల్ మాత పుణ్యక్షేత్రం ఫాదర్ చలివేంద్ర శౌరి ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి యేసు పునరుత్థాన మహోత్సవం దివ్యబలి పూజను ఆరాధన సాంఘ్యలను సమర్పించారు. ఈ మహోత్తర కార్యక్రమాలను ఫాదర్ చలివేంద్ర శౌరి ఫాదర్ దేవదానం, ఫాదర్ రత్నరాజ్ లు నూతన అగ్ని ద్వారా పాస్క వత్తిని వెలిగించారు. చిన్నారి పిల్లలకు జ్ఞానస్నానం ఇచ్చి నూతన నామకర్ణాలను నిర్వహించారు, బాలబాలికలకు నూతనంగా దివ్యాసప్రసాద సంస్కరణలు ఇచ్చారు. భక్తులందరూ నూతన వెలుగు ద్వారా కొవ్వొత్తులను వెలిగించి ఆరాదనలో పాల్గొన్నారు.
ఈ మహోత్సవంలో గంగూరు,సాలిపేట,పారంకి, కమయ్యతోపు,కానూరు వివిధ ప్రాంతాలనుండి రెండు వేలమంది పైన భక్తులు భక్తి విశ్వాలతో పాల్గొన్నారు. భక్తులందరికి దివ్యసప్రసాదం అందించారు. గాయక బృందం ఆలపించిన ఆరాధన గేయాయాలు అందరిని భక్తి మార్గంలో నడిపించాయి. యూత్ వారు ఏర్పాటు చేసిన యేసు పునరుత్థానం ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. సి.టి.సి.సిస్టర్స్, ఉపదేశకులు, ఫారిష్ కౌన్సిల్ సభ్యులు, యూనిట్స్ లీడర్స్ పాల్గొన్నారు. అందరికి సి.పి.ఓ. రమేష్ బ్రడ్స్ పంచి పెట్టారని కార్మెల్ మాత పుణ్యక్షేత్రం విచారణ ఫాదర్ చలివేంద్ర శౌరి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com