జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ 42 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి టిడిపి నాయకులు పాల్గొన్నారు.