బనగానపల్లె ప్రజాగళం ప్రచార యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసమే సీఎంఓలోకి డబ్బులు కంటైనర్ వచ్చిందని ఆయన ఆరోపించారు. మద్యం, ఇసుకలో వచ్చిన డబ్బులను కంటైనర్ లో తరలించారని చంద్రబాబు అన్నారు. మద్యం బాటిల్ ను చూస్తే జగన్ గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో తాడేపేడో తేల్చుకుంటామని చంద్రబాబు సవాల్ చేశారు.