ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 11:34 PM

ఐపీఎల్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. అయితే 186 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసి ఓటమిపాలైంది.  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్క్ 49 పరుగులు, మిచెల్ మార్ష్ 23, రిషబ్ పంత్ 28, ట్రిస్టన్ స్టబ్స్ 44, అభిషేక్ పోరెల్ 9, అక్షర్ పటేల్ 15 పరుగులు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com