నాతవరంలో అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గొలుగొండ ఎస్ఈబీ ఎస్సై ఎస్ కె. రహీం బుధవారం తెలిపారు.
బుధవారం నాతవరం గ్రామానికి చెందిన గిడుతురు వరహాలబాబు అనే వ్యక్తి వద్ద నుంచి 10 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. దీంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై చెప్పారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ సిబ్బంది పాల్గొన్నారు.