మంగళవారం వాయువ్య పాకిస్థాన్లో ఆత్మాహుతి బాంబర్ వారి కాన్వాయ్పై జరిపిన దాడిలో ఐదుగురు చైనా జాతీయులు మరణించారు. ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని దాసులోని తమ క్యాంపుకు వెళ్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్పైకి పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఆత్మాహుతి బాంబర్ ఢీకొట్టాడని ప్రాంతీయ పోలీసు చీఫ్ మహ్మద్ అలీ తెలిపారు.ఈ దాడిలో ఐదుగురు చైనా పౌరులు, వారి పాకిస్థానీ డ్రైవర్ మృతి చెందారని గండాపూర్ తెలిపారు.ఘటనా స్థలంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని, మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ వాహనం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతామని ఎస్హెచ్ఓ తెలిపారు. పాకిస్థాన్లో చైనా ప్రయోజనాలపై వారం వ్యవధిలో ఇది మూడో అతిపెద్ద దాడి.