లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి మారారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన లూథియానా ఎంపీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు పంజాబ్పై ఎంతో అభిమానం ఉందని కొనియాడారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ, అమిత్ షాలకు పంజాబ్పై విపరీతమైన ప్రేమ ఉందని నేను చూశాను. పంజాబ్ కోసం వారు చాలా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నారని బిట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉగ్రవాదం చీకటి రోజులని గుర్తు చేస్తూ.. శాంతి స్థాపనలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. బీజేపీలో చేరడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అన్నారు.జనవరిలో ఏర్పాటు చేసిన 27 మంది సభ్యుల పంజాబ్ యూనిట్ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో రవ్నీత్ సింగ్ బిట్టు ఉన్నారు.