ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతకల్లు అభ్యర్థిని ప్రకటించాలి: టిడిపి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2024, 12:13 PM

గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని అధిష్టానం వెంటనే ప్రకటించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నాయకులు మస్తాన్ యాదవ్, కేశప్ప, హనుమంతు మాట్లాడుతూ ఈనెల 11న గుంతకల్లులో జరిగే శంఖారావం సభలోగా పార్టీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించాలన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న జితేంద్ర గౌడ్ కు టికెట్టు ఇస్తే గెలుపు సాధిస్తామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com