ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సును ఢీకొట్టిన లారీ.. 35 మందికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 09:52 AM

ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చవట కండ్రిక వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాతులను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారని, ఎలాంటి ప్రాణహాని జరగలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com