ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్వింటా రూ. 34000 పలికిన చింతపండు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 02:51 PM

హిందూపురం వ్యవసాయ మార్కెట్లో చింతపండు ఈ ఏడాది ఇప్పటి వరకు పలకని ధర పలికింది. గురువారం మార్కెట్ లో 2, 438 క్వింటాళ్ల సరకు రాగా, ఈ-నామ్ పద్ధతిలో వేలం నిర్వహించారు. అందులో కరిపులి క్వింటా గరిష్టంగా రూ. 34 వేలు, కనిష్టంగా రూ. 8 వేలు, సగటున రూ. 12 వేల ప్రకారం పలికింది. ఇక బోటు రకం చింతపండు గరిష్టంగా రూ. 3, 500, కనిష్టంగా రూ. 2, 500 పలికినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com