ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 01:33 PM

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఈనెల 11 వరకు నల్లమల్లలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు తెలిపింది.
వాహనదారులు పరిమిత వేగంతో, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలను నడపాలని సూచించింది. సాధారణంగా ఈ రూట్‌లో రాత్రి 9 గం. నుంచి ఉదయం 6 గం. వరకు వాహనాలను అనుమతించరు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com