ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగునీరు ఎద్దడి నివారణకు చర్యలు: కమిషనర్ శ్రీనివాసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2024, 12:36 PM

వేసవిలో ప్రజలకు తాగునీరు ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గుత్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయ తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వేసవిలో ప్రజలకు తాగునీరు ఎద్దడి నివారణకు రూ. 2 కోట్లు వెచ్చించి పామిడి పెన్నాలో సత్యసాయి పథకానికి 4 బోర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా కొత్తగా మరో 10 నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com