ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లండ్‌పై అశ్విన్‌ వికెట్ల ‘సెంచరీ’

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 12:51 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్పిన్ బౌలర్ అశ్విన్‌ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన రెండో బంతికి బెయిర్‌ స్టో ఔటయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. 
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్ జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com