ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రహస్యం ఏంటి జగనన్నా.. మాజీ మంత్రి గంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 09:15 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు. మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ టార్గెట్ చేశారు. టీ స్టాల్ దగ్గర నుంచి, కిళ్ల కొట్టు వరకు అన్నిచోట్ల డిజిటల్ పేమెంట్ ప్రపంచం ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ కు నో ఛాన్స్ అన్నారు. అంతా క్యాష్ మయం.. ఏంటి ఈ రహస్యం..? ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్న..? అంటూ ప్రశ్నించారు.


'వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా..? ఇంత విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మి పేదోడిని దోపిడీ చేసిన ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్రలు తిరగేసినా దొరకరేమో...!. రేట్లు సంగతి దేవుడెరుగు.. బ్రాండ్‌లన్నీ.. బ్రాంతియేలా మార్చారు. ప్రీమియం పేరును మాయం చేశారు. నిఖార్సైన సరుకుకు ఏనాడో స్వస్తి పలికారు.. ఐదేళ్ళుగా 'J' బ్రాండులతో హానికర కిక్‌ను నింపారు. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయం ను చూపిస్తూ 15 ఏళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మీది.. మీ నాసిరకం మద్యం వల్ల 35 లక్షల మందిని రోగాల బారిన పడ్డారు.. అందులో 30 వేల మంది ప్రాణాలు తీశారు'అంటూ ధ్వజమెత్తారు.


మద్యంతో దోపిడీ చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ 'జగనన్న సురక్ష' అంటూ మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తున్నారన్నారు. అమ్మఒడి పేరుతో ప్రభుత్వం వేస్తున్న డబ్బులకు, నాన్న బుడ్డికి లెక్కతో సరి చేస్తున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధం కాస్తా.. మద్యం ఏరులై పారిస్తూ.. కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు పెట్టి పేదోడిని దోపిడీ చేస్తున్న మీకు బుద్ధి చెప్పడానికి అదే పేదోడు సిద్దంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com