ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీటిని పాటించకపోతే పేదరికానికి దారితీస్తుందా?

Astrology |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 09:33 AM

ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమని పెద్దలు ఊరకనే చెప్పలేదు. ఇంటి నిర్వహణలో మహిళల పాత్రే కీలకం. కుటుంబం కలిసుండాలన్నా, విడిపోవాలన్నే ఆమే కారణం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు కొన్ని తప్పసరిగా పాటించాలట. అలాకాని పక్షంలో ఇంటిలో దరిద్రం తాండవించి, ఇంకా పేదరికంలో కూరుకుపోతారట. చేయాల్సిన పనులు ఇవే..
సూర్యోదయానికి ముందే మహిళలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేస్తే పేదరికానికి దారితీస్తుంది.
ఇంటిని శుభ్రంచేసిన వెంటనే స్నానం ముగించాలి. ఆలస్యం చేయడం వల్ల పేదరికంతోపాటు దు:ఖానికి కారణమవుతుంది.
కుటుంబం కోసం వంట చేయడం అంటే దేవుడికి నైవేథ్యం వండటంతో సమానం. కాబట్టి స్నానం ముగించిన తర్వాతే వంటగదిలోకి అడుగుపెట్టాలి.
పూజ ముగించి, దేవుడికి నైవేథ్యం సమర్పించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అలా కాకుండా ఆహారం స్వీకరించిన తర్వాత దేవుడికి నివేదిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కదు.
సూర్యాస్తమయం తర్వాత తల దువ్వుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. సాధ్యమైనంత వరకు సాయంత్రం తలదువ్వకపోవడమే మంచిది.
మహిళలు ఎప్పుడూ చిరాకు, కోపంతో ఉంటే ఆ ఇంట్లో సంతోషమే ఉండదు. అకారణంగా చిరాకు పడటం, కోపగించుకోవడం లాంటివి తగ్గించుకోవాలి. దీని వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com