ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమిషాల వ్యవధిలో పాక్ సహా మూడు దేశాలను కుదిపేసిన భూకంపాలు

international |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 09:36 PM

పాకిస్థాన్, న్యూగినియా, టిబెట్‌ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భూకంపాలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో మంగళవారం తెల్లవారుజామున 3.38 గంటలకు భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రాన్ని 34.66 డిగ్రీల ఉత్తర అక్షాంశం.. 73.51 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య 10 కి.మీ. లోతులో గుర్తించినట్టు పేర్కొంది. అయితే, భూకంప కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం తెలియరాలేదని ఎన్‌సీఎస్ వెల్లడించింది. అయితే, దీనికి ముందు పపువా న్యూగినియా తీరంలో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుందని చెప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు భూకంపం వచ్చిందని తెలిపింది. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 6.6గా పేర్కొంది. ఆస్ట్రేలియా వాతావరణ విభాగం మాత్రం ఈ భూకంపం వల్ల తమ తీరానికి ప్రస్తుతం సునామీ ముప్పు లేదని పేర్కొంది. ఇక, చైనా సరిహద్దుల్లో టిబెట్ లేదా జియాంగ్‌లో ఉదయం 3.45 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం 140 కి.మీ. లోతున ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించింది. మంగళవారం ఉదయం కొద్ది నిమిషాల వ్యవధిలోనే మూడు వేర్వేరు దేశాల్లో భూకంపాలు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com