ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 01:36 PM

దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 19న సికింద్రాబాదులో రాత్రి 8 గంటలకు (07041)బయలు దేరి మంత్రాలయం, గుంతకల్లు, తాడిపత్రి మీదుగా తిరుపతికి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుతుందని తెలిపారు. అదేవిధంగా తిరుగు ప్రయాణం రైలు (07042) 20 తేదీన తిరుపతిలో రాత్రి 7-50 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మరుసటి రోజు ఉదయం 9-30 గంటలకు చేరుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com