ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్కాన గోశాల గురించి తప్పుగా మాట్లాడకండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 12:02 PM

హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్‌దాస్‌తో కలిసి, అనంతపురం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఇస్కాన గోశాలను ఇస్కాన బ్యూరో దామోదర్‌ దలాల్‌ దాస్‌ సదర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఆమె వ్యాఖ్యలకు, ఇస్కాన గోశాలలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని అన్నారు. ఆమె అనంతపురం గోశాలను సందర్శించినట్లు వ్యాఖ్యానించడం, ఇక్కడ డెయిరీ తరహాలో పాల విక్రయాలు సాగిస్తున్నారని ఆరోపించడంపై వారు స్పందించారు. మేనకాగాంధీ అవాస్తవాలు మాట్లాడారని తాము గుర్తించామని పేర్కొన్నారు. అనంతపురం ఇస్కాన గోశాలలో మొత్తం 412 పశువులు ఉన్నాయని, వాటిలో పాలిచ్చే ఆవులు 18 మాత్రమేనని అన్నారు. మిగిలినవాటిలో 72 ఎద్దులు, 75 దూడలు, పాలివ్వని ఆవులు 247 ఉన్నాయని పేర్కొన్నారు. అనంతపురం నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో గాయపడిన గోవులను, దూడలను, ఎద్దులను గోశాలకు తీసుకువచ్చి తాము రక్షిస్తున్నామని అనంతపురం ఇస్కాన మందిర చైర్మెన దామోదర్‌ గౌరంగదాస్‌ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com