మచ్చలేని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు, స్కిల్ డెవలెప్మెంట్ లో అవినీతి జరగలేదని సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలే చెప్తున్నాయని స్పష్టం చేశారు. దోపిడీ వ్యవస్థకు జగన్ అధిపతి అని, యువతను దెబ్బతీయడమే జగన్ క్రిమినల్ ఆలోచన అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రత పట్ల యనమల ఆందోళన వ్యక్తం చేశారు. జైలు లోపలికి తనను పంపిస్తే భద్రతా లోపాలు చూపిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న జగన్ వంటి వ్యక్తి చంద్రబాబుకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు? అని యనమల ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో లోకేశ్ బస చేసే విడిది కేంద్రం వద్ద యనమల ఇవాళ మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు.