ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కరణం ధర్మశ్రీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 04:26 PM

ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం చోడవరం మండలం లక్కవరం లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో మరల వాటిని పొందాలన్నా మరిన్ని సంక్షేమాలు అందుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు.

ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ ప్రజల చెంతకు సంక్షేమ ఫలాలు తీసుకెళ్తున్న వాలంటీర్లను ఆయన అభినందించారు. అలాగే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు తగిన నిధులు మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్. వి రమణ, మాజీ జెడ్పిటిసి బి. సూర్యనారాయణ తదితరులతో పాటు అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com