బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో ఆదివారం భక్తుల తాకిడి నెలకొంది.సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి పోటెత్తారు. క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అదేవిధంగా క్షేత్ర పరిసరాల్లోని సందర్శన ప్రదేశాలను వీక్షించారు.అలాగే క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు.