‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ కార్యక్రమంపై రెజ్లర్ భజరంగ్ పునియా స్పందించారు. మహాపంచాయత్ నేడే జరుగుతుందన్నారు. ‘‘మేము మా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. వారు ఈరోజు పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్నారు. కానీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మా వారిని విడిచి పెట్టాలని కోరుతున్నాం’’అని పునియా చెప్పుకొచ్చారు.