ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ పై ఘన విజయం సాధించిన లక్నో

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 11:43 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా మొహాలీలోని పీసీఏ స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు రికార్డు స్థాయిలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. అయితే 258 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ నిర్ణీత 19.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్లలో అథర్వ తైడే 66 పరుగులు,  సికందర్ రజా 36 పరుగులు, జితేష్ శర్మ 24 పరుగులు, లివింగ్ స్టోన్ 23 పరుగులు చేసారు. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ నాలుగు వికెట్లు, నవీన్ ఉల్ హక్ చెరో మూడు వికెట్లు, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశారు, స్టొయినిస్ కి ఒక వికెట్ తీశాడు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com