ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు తరువాత టీడీపీ ఉండదు,,,ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 09:35 PM

చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదని ర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆరే నాయకుడు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుప్పంతో పాటూ ఇతర ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. లోకేష్ పది పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేరని.. లోకేష్ పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు.. కానీ మంత్రి రోజా లోకేష్‌కు పప్పు అని పేరు పెట్టిందని ఎద్దేవా చేశారు.


రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని.. పాలన పారదర్శకంగా సాగుతోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేపర్‌పై పనులు మంజూరు చేశారని.. కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. కానీ సీఎం జగన్ మాత్రం పేదలకు సంక్షేమ అందిస్తున్నారని.. అభివృద్ధి పనులు చేస్తున్నారని ప్రశంసించారు. టీడీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. అలాగే ఆర్డీఎస్ కుడి కాలువ నీళ్లను నందవరం రైతుల కిందకు రానిస్తారా అన్నారు. అధికారులకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరానన్నారు.


చెన్నకేశవరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. 2012 ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి టికెట్ దక్కలేదు. అక్కడ టీడీపీ నుంచి పోటీచేసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి గెలిచారు. 2019లో మళ్లీ వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసిన చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.


గతంలో చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంరేపాయి. రాష్ట్రంలో వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయాలని కామెంట్ చేశారు.. వీఆర్‌వో, వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతోంది అన్నారు. వీఆర్‌ఏ వ్యవస్థ బ్రిటిష్‌ కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తోందని.. దీన్ని తొలగించాలన్నారు. అక్కడితో ఆగలేదు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోదీని ఢీకొన్న ఏకైక మొనగాడు అంటూ కితాబిచ్చారు. అలాగే గోవ నిషేధ చట్టంపై చెన్నకేశవరెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం రేగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com