బాపట్లజిల్లా చీరాల రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతూ ఓ మహిళ కాలుజారి పడిపోయారు. రైల్వే స్టేషన్లో ఓ మహిళ రైళ్లు ఎక్కబోయారు.. ఆ హడావిడిలో పొరపాటున ఆమె కాలు జారడంతో రైలుకు ప్లాట్ఫామ్కు మధ్యన ఇరుక్కుపోయారు. మహిళ ప్రాణభయంతో కేకలు వేయడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రైల్వే పోలీసులు పరుగున అక్కడికి వచ్చారు. మహిళను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.. కానీ సాధ్యపడలేదు. చివరికి ప్లాట్ ఫామ్ పగులగొట్టి అతి కష్టం మీద చాకచక్యంగా వ్యవహరించి ఆమెను బయటకు తీసి వెంటనే 1018 వాహనంలో చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళను కాపాడిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, నాగార్జునలను ప్రయాణికులు, స్థానికులు అభినందించారు.