ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా చనిపోయినట్లు చెప్పింది ఆయనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 06:03 PM

మాజీ మంత్రి వివేకా హత్యపై ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. వివేకా మరణించినట్లు శివప్రకాష్‌రెడ్డి తనకు చెప్పారన్నారు. తాను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నానన్నారు. పులివెందుల రింగ్‌రోడ్డు దగ్గరున్నప్పుడు కాల్‌ వచ్చిందన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా అని అడిగానన్నారు. తాను వెళ్లక ముందే వివేకా రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ను దాచేశారన్నారు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వివేకా లేఖ రాశారన్నారు. లేఖ, సెల్‌ఫోన్‌ దాచమని రాజశేఖర్‌రెడ్డి చెప్పారని అవినాశ్‌రెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com