ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. వృత్తి విద్యా కోర్సు ఫలితాలు కూడా విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 83 శాతంతో మొదటి స్థానంలో, విజయనగరం 57 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది. 4.33 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా, 61 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 3.79 లక్షల మంది ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 72 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఫస్టియర్ లో 2.66 లక్షల మంది, సెకండియర్ లో 2.72 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్, సెకండియర్... రెండింట్లోను అమ్మాయిలే టాప్ గా నిలిచారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల కోసం దరఖాస్తు గడువు తేదీని మే 6వ తేదీగా నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ జూన్ 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.