ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అలిగారా అని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ఆయనను విమర్శిస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేస్తూ ఉండడంతో ఎమ్మెల్యే అలిగారని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈసారి ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని ఎమ్మెల్యే సన్నిహిత వర్గాలు అంటున్నాయి.