ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు,,,నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 06:22 PM

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండె పోటోకు గురయ్యారు. దీంతో ఆయన నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇన్ పేషెంట్‌గా చేరి చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసంమని చెన్నైకి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు కావలి డీఎస్పీ వెంకట రమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు ఆసుపత్రికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.


మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009లలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) లో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి బొల్లినేని వెంకట రామారావు చేతిలో స్వల్ప తేడాతో ఓడారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.


ఇటీవల ఆయన పార్టీలో విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన పార్టీ అధిష్టానం.. ధనుంజయరెడ్డిని తప్పించింది. పార్టీ ఆ చర్యలు తీసుకొని 24 గంటలు కూడా గడవక ముందే.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండె పోటు వచ్చిందని తెలియడంతో.. ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com