ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ పే తో 40 వేల రూపాయలకు టోకరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 02:23 PM

ఓ అపరిచిత వ్యక్తి మేనల్లుడి మాదిరి ఫోను చేసి 40 వేల రూపాయలు పంపమంటే ఫోన్ పే చేసి ఆ మొత్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఉదంతం పరుచూరులో మంగళవారం వెలుగు చూసింది. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే అడుసు మల్లికి చెందిన నరసయ్య అనే వ్యక్తికి సోమవారం ఓ అపరిచితుడు ఆయన మేనల్లుడు అయిన సాయి పేరుతో ఫోన్ చేసి తాను అత్యవసరంగా కళాశాల ఫీజు చెల్లించాల్సి ఉందని, వెంటనే 40 వేల రూపాయలు ఫోన్ పే చేస్తే తరవాత తన అమ్మానాన్నలు ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తారని చెప్పాడు. అయితే ప్రస్తుతం తన ఫోన్లో చార్జింగ్ లేనందున తాను చెప్పే రెండు ఫోన్ నెంబర్లకు ఆ మొత్తం పంపాలని కోరాడు. ఇద్దరు వ్యక్తుల ఫోన్ పే నెంబర్లు ఇచ్చాడు.


ఆ ఇద్దరు వ్యక్తులతో ముందే అపరిచితుడు మాట్లాడుకొని డబ్బు వచ్చాక కొంత కమిషన్ ఇస్తానని, మిగిలిన మొత్తం తనకి ఇమ్మని ఒప్పందం చేసుకున్నాడు. అలాగే నరసయ్య ఆ ఇద్దరికి డబ్బు పంపగానే సదరు వ్యక్తి వారి కమిషన్ వారికి ఇచ్చి మిగిలిన డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తరువాత నరసయ్య తన మేనల్లుడు సాయి అమ్మానాన్నలకు డబ్బు ఫోన్ పే చేసిన విషయం చెప్పగా వారు విస్తు పోయారు. సాయి అసలు ఆ ఫోన్ తాను చేయలేదని చెప్పాడు. దీంతో నరసయ్య మోసపోయానని గ్రహించి బంధువుల సాయంతో తాను డబ్బు పంపిన ఫోన్ పే నెంబర్లు కలిగిన వారి కోసం పర్చూరులో గాలిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com