పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక రేపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ పార్లమెంట్ సమావేశాలు 2 విడతల్లో జరగనున్నాయి.