ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానసిక వ్యాధితో బాధపడుతున్న,,, ఏఎస్ గోపాలకృష్ణ దాస్‌

national |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:50 PM

ఒడిశా మంత్రి చావుకు కారణమైన ఏఎస్ గోపాలకృష్ణ దాస్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఇదిలావుంటే ఒడిశా మంత్రిపై పోలీస్ అధికారి కాల్పులు జరిపిన ఘటనపై యావత్తు దేశం ఉలిక్కిపడింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబ కిశోర్‌ దాస్‌ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే, ఉన్నతాధికారుల వేధింపులతో విసిగిపోయిన నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. కానీ, ఏఎస్ గోపాలకృష్ణ దాస్‌ మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్టు అతడి భార్య జయంతి దాస్ తెలిపారు. బ్రహ్మపురలోని ఓ ప్రైవేటు క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారని ఆమె అన్నారు. ఆదివారం ఉదయం కుమార్తెతో వీడియో కాల్‌లో మాట్లాడిన తన భర్త బాగానే ఉన్నారని చెప్పారు. దాదాపు ఏడు నెలల కిందట ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో ఆయన సాధారణంగా ఉండేవారని పేర్కొంది.


నిందితుడు దాస్‌‌కు చికిత్స అందించిన స్థానిక ఎమ్కేసీజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వైద్యుడు చంద్రశేఖర త్రిపాఠి మాట్లాడుతూ.. దాస్‌ ‘బైపోలార్‌ డిజార్డర్‌’తో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స కోసం సుమారు ఎనిమిది సంవత్సరాల కిందట తన వద్దకు వచ్చారని చెప్పారు. ఉత్తేజంగా, చంచలంగా ఉండడం, నిద్రలేమితో బాధపడుతున్న ఆయనకు మూడు రకాల ఔషధాలను సూచించినట్టు తెలిపారు. ఏడాది కిందట మళ్లీ వచ్చారని, అవే ఔషధాలను వాడాలని చెప్పానని వివరించారు. వాటిని వాడకుంటే రోగం తిరగబెట్టే అవకాశముందని అన్నారు.


సంఘటన జరిగిన 12-24 గంటల్లోగా నిపుణులతో దాస్‌ పరీక్షలు చేయిస్తే అతడి మానసిక మానసిక స్థితి తెలుస్తుందని డాక్టర్ త్రిపాఠీ తెలిపారు. ప్రస్తుతం ఆయన మందులు వాడుతున్నదీ లేనిదీ తెలియదన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బైపోలార్ డిజార్డర్ అనేది మానసిక ఆరోగ్య పరిస్థితి. ఎక్కువ ఉత్తేజం నుంచి డిప్రెషన్ వరకు విపరీతమైన మానసిక కల్లోలం కలిగిస్తుంది. అయితే, కౌన్సెలింగ్‌తో సహా చికిత్స ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com