ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చెయ్యండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 03:23 PM

కొన్నేళ్లుగా తమ అనుభవంలో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని నెల్లూరు జిల్లా, ఉదయగిరి  మండలంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళా రైతులు ,రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ....  గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేదలు కొందరు కొన్నేళ్లుగా లింగాలవాగు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న భూ పంపిణీలో ఆ పేదలకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. పట్టాలు మంజూరు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దారు సానా శ్రీనివాసులురెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కాకు విజయమ్మ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com