ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:16 PM

నంద్యాల జిల్లాలో బీటెక్ విద్యార్థి అబ్దుల్లా అనే యువకుడు  ఆత్మహత్య చేసుకున్నాడు. హనీప్‌నగర్‌లోని ఇంట్లో అబ్దుల్లా ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com