ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 957 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 08:23 AM
ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 957 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం ఇటీవల 461 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానికి అదనంగా 496 పోస్టులను కలిపి మొత్తం 957 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌ వైఫర్‌ లేదా బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి 42 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు. https://cfw.ap.nic.in వెబ్‌ సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయాల్లో ఈ నెల 9వ తేదీ సా.5 గంటలలోపు సమర్పించాలి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com