ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ద్రోహి ప్రధాని మోడీ: వామపక్ష పార్టీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 01:49 PM

విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి వాటిలో ఒక్క హామీని అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ద్రోహిగా మిగిలిపోతాడని వామపక్ష పార్టీలు నాయకులు అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యట నను వ్యతిరేకిస్తూ శనివారం సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బి. శ్రీనివా సులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బి. సురేష్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి మాట్లా డుతూ రాష్ట్రానికి ఇచ్చిన హామీలైన ఏపీకి ప్రత్యేక హోదా, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కడపలో ఉక్కు పరిశ్రమ, కర్నూల్ లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ హాస్పిటల్, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటి హామీలతో ఏ ఒక్కటీ అమలు చేయని మోడీ రాష్ట్ర పర్యట నకు అనర్హుడు అన్నారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు డి. శ్రీనివాసులు నాయ కులు మారుతి ప్రసాద్, కసాపురం రమేష్, సాకే నాగరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామాంజనేయులు, రంగస్వామి సిపిఐ నాయకులు రాము రాయల్, వెంకట్ నాయక్, మురళి కృష్ణ, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com