ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజులపేటలో గడప గడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:31 AM

పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం గాజులపేట, కోమటిపేట, రెడ్డిగారిపల్లె గ్రామాలో సోమవారం గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గ్రామాలల్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా విచ్చేసిన అవినాష్ రెడ్డికి వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తారని ఆయన ప్రజలకు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com