ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 11:53 AM

లో ఓల్టేటి సమస్య లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. మండల కేంద్రమైన చేబ్రోలులో విద్యుత్ సబ్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీడర్ బ్రేకర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజా సంక్షేమాన్ని, కార్యక్రమాలను పక్కాగా చేస్తుందన్నారు. జగన్మోహనరెడ్డి తిసుకొన్న నిర్ణయాలు, సంస్కరణలను ఇతర రాష్ట్రాలు కూడా అభివృద్ధి అమలు అవలంభిస్తున్నాయంటే వాటి ఫలితం ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. నూతన పీడర్ల ఏర్పాటు ద్వారా చేబ్రోలులో నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు కూడా ఏ ప్రభుత్వం చేతల ప్రభుత్వమో, మాటల ప్రభుత్వమో ఆలోచించి రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్మోనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఇ చిరంజీవి, ఎఈ సుధీర్, మండల పరిషత్ పసుపులేటి శ్రీనివాసరావు, ఎంఎస్ఎస్ఈ డైరెక్టర్ భీమవరపు విజయలక్ష్మి, జీడీసిఎమ్మెస్ డైరెక్టర్ కుర్రా పాములు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com