ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలతో ప్రజల సంతృప్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 12:14 PM

తాడిపత్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వైఎస్సార్ సీపీ యువనేత కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూరు గ్రామంలో బుధవారం సాయంత్రం జన చైతన్యయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ ప్రజల సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల తన దృ ష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని అధికారులను కోరారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజ లకు తెలియచేశారు. ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రంగారావు, సర్పంచ్ సుబ్బయ్య, వైస్ సర్పంచ్ రంగనాయకులు, ఎంపీపీ సరస్వతి, వైస్ ఎంపీపీ శ్రీదేవి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, రామేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com