ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు నుంచి జారిపడి మహిళకు తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 12:17 PM

రైలు నుంచి జారిపడి ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన శ్రీకాళహస్తి మండలం ఎల్లాకారు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగింది. 108 వాహన సిబ్బంది కథనం మేరకు పులిచెర్ల మండలం దీన్నేబెస్తపల్లి కు చెందిన నాగరత్నమ్మ (57) విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లి రైల్లో తిరిగి వస్తుండగా జారి పట్టాల పక్కన పడింది. ఈ ఘటనలో నాగరత్నమ్మ కాళ్లు విరిగిపోవడంతో పాటు తీవ్రంగా గాయపడింది. రైల్వే కార్మికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో వైద్యం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం కుటుంబ సభ్యులు చెన్నై ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com