ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ పథకం కింద కనీసం రూ. 240 వేతనం: సీఎం జగన్ ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:41 PM

ఉపాధి హామీ పథకం కింద కనీసం రూ. 240 వేతనం అందేలా చూడాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పని తీరుకు ప్రమాణమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.


గడపగడపకు మన ప్రభుత్వంలో వచ్చిన అంశాలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు మొదలు కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే, అక్టోబర్ 25న ఈ- క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. డిసెంబర్‌ 21వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌- 3 కింద డిసెంబర్‌లో ఇళ్ల మంజూరు చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com