ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంటపడి వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:18 PM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గౌడ పాలెం గ్రామానికి చెందిన గురజాల హెప్సీబా శ్రీరంగపురం గ్రామంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పని చేస్తుంది. అయితే గత కొంతకాలంగా బాపట్ల మండలం మారుప్రోలు గ్రామానికి చెందిన కావూరు జనార్ధన్ అనే వ్యక్తి తనను వెంటబడి వేధిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తన మాట వినకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని చేబ్రోలు పోలీస్ స్టేషన్లో హెప్సీబా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై గ్రంధి వెంకటాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com