కుప్పానికి చంద్రబాబు విజిటిం ఎంఎల్యే యే గా తయారయ్యారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ పేరు తలిచే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. వైసీపీ పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. చంద్రబాబు బతికున్నంతకాలం నారా ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప.. నందమూరి ఫ్యామిలీని పట్టించుకోరని విమర్శించారు. టిడిపి లో కొందరు నేతలు జూ.ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారని.. అయితే ఆయన్ను కలవొద్దని నేతలకు చంద్రబాబు చెప్పారన్నారు.