బీహార్లోని పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రసంగించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్పై ఆయన విమర్శల దాడి చేశారు. బీజేపీకి నితీష్ ద్రోహం చేశారన్నారు. ప్రధాని అయ్యేందుకు లాలూ ప్రసాద్ యాదవ్తో నితీష్ చేతులు కలిపారని ఆరోపించారు. ఇదిలా ఉండగా సోనియా గాంధీతో నేడు నితీష్, లాలూ భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.