ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులపై దాడిని ఖండించిన బీసీ యువజన సంఘం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 10:46 AM

బీసీ సామాజిక వర్గం రైతులపై అగ్రవర్ణాల దాడిని సీమాంధ్ర బి. సి. సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లీలాక్రిష్ణయాదవ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిధిలోని మర్రిపాడు మండలం, కృష్ణపురం గ్రామానికి చెందిన బి. సి. సామాజికవర్గం దూదేకుల కులానికి. చెందిన షేక్. అబ్దుల్ అనే రైతు తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన 3 ఎకరాల పొలంను 2015 నుండి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. పొలం అమ్మ లేదన్న కారణంతో అదే గ్రామానికి అగ్రకులానికి చెందిన వ్యక్తులు బీసీ రైతుపై దాడి చేయడం అన్యాయమన్నారు. దీనిపై అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com