రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు వెస్ట్మినిస్టర్లోని అబ్బేలో సోమవారం జరుగనున్నాయి. బ్రిటన్లో అర్ధశతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ఎలిజబెత్ 2కి అధికారులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ మినహా అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరుకానున్నారు.