ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దిల్ కుషా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఓ గోడ కుప్పకూలిపోయింది. దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) పీయూష్ మోర్దియా చెప్పారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని వివరించారు. వారిద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.