కర్ణాటకలోని బెంగళూరులో లక్ష్మమ్మ(48) అనే మహిళ తన కొడుకు మదన్(13)ను గొంతు పిసికి చంపి, ఆ తర్వాత తాను ఉరివేసుకుంది. తన తమ్ముడు సిద్దేగౌడ భార్య రంజిత కట్నం, గృహహింస కేసు పెట్టింది. పోలీసులు సిద్దేగౌడను అరెస్ట్ చేశారు. లక్ష్మమ్మ, ఆమె భర్తతో పాటు 9 మందిపై కేసు నమోదైంది. దీంతో విరక్తి చెందిన లక్ష్మమ్మ దారుణానికి పాల్పడింది. రంజిత వేధింపుల వల్లే సూసైడ్ చేసుకొంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపింది.