హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రేపు సంచార వైద్యశాలలను ప్రారంభించనున్నారు. 100 నియోజకవర్గాల్లో సంచార పశువైద్యశాలలు ప్రారంభం కానున్నాయి. గ్రామీణ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున సంచార పశువైద్యశాల ఏర్పాటు చేయనున్నారు. సంచార పశువైద్యశాల కోసం టోల్ఫ్రీ నెంబర్ 1962ను ఏర్పాటు చేశారు. నెంబర్కు ఫోన్ చేసిన అరగంటలో రైతు వద్దకు సంచార పశువైద్యశాల చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు.